Hot Posts

6/recent/ticker-posts

దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. షాకింగ్ గా మరణాల సంఖ్య!


INDIA NEWS: సుమారు నాలుగేళ్ల క్రితం భారత్ తో పాటు ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారి.. మరోసారి విజృంభిస్తున్నట్లు కనిపిస్తోంది! ఈ క్రమంలో వరుసగా రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో మహారాష్ట్ర, ఢిల్లీలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి! ఈ నేపథ్యంలో తాజాగా దేశంలో తొలి కోవిడ్ మరణం నమోదైంది.


దేశంలో కోవిడ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి! ఈ క్రమంలో తాజాగా ఢిల్లీలో శనివారం తొలి కోవిడ్ మరణం నమోదైంది. పేగు సంబంధ ఆపరేషన్ చేయించుకున్న ఓ 60 ఏళ్ల మహిళ కోవిడ్ సోకి మరణించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో గత 24 గంటల్లో దేశంలోని వివిధ చోట్ల సుమారు నలుగురు కోవిడ్ వల్ల మరణించినట్లు తెలుస్తోంది.

మరోపక్క కోవిడ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 682 కేసులు నమోదయ్యాయి. దీంతో.. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,3695కు చేరుకుంది. తాజాగా ఆరోగ్యశాఖ అధికారులు ఈ విషయాలను వెల్లడించారు. నాలుగు రోజుల్లోనే పలు రాష్ట్రాల్లో కేసులు వేగంగా పెరిగినట్లు చెబుతున్నారు.

ఇందులో భాగంగా... కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ వంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ... కరోనా కొత్త వేరియంట్లపై భయాందోళనలు అవసరం లేదని, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇక రాష్ట్రాల వ్యాప్తంగా కేసుల సంఖ్య విషయానికొస్తే... అత్యధికంగా కేరళలో 1,336 కేసులు నమోదయ్యాయి. అనంతరం... మహారాష్ట్రలో 467, ఢిల్లీలో 375, గుజరాత్ లో 265, కర్ణాటకలో 234, పశ్చిమ బెంగాల్ లో 205, తమిళనాడులో 185, ఉత్తరప్రదేశ్ లో 117, రాజస్థాన్ లో 51, పుదుచ్చేరిలో 25, హర్యానాలో 20, ఆంధ్రప్రదేశ్ లో 16, మధ్యప్రదేశ్ లో 10, గోవాలో 7 కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో... ఒడిశా, జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కోచోటా మూడేసి కేసులు నమోదవ్వగా... అస్సాం, మిజోరాం రాష్ట్రాల్లో రెండేసి కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.