ANDRAPRADESH, GUNURU, TENALI: తప్పు ఎవరు చేసినా తప్పే. దానిని సమర్థించుకుంటూ పోతే.. ఎంత మెజారిటీ స్థాయిలో సంఖ్యా బలం ఉందని భావించిన ప్రభుత్వానికైనా ఇబ్బందులు తప్పవు. తప్పు ఎవరు చేసినా తప్పే. దానిని సమర్థించుకుంటూ పోతే.. ఎంత మెజారిటీ స్థాయిలో సంఖ్యా బలం ఉందని భావించిన ప్రభుత్వానికైనా ఇబ్బందులు తప్పవు.
ఈ విషయంపైనే ఇప్పుడు కూటమి సర్కారుకు నెటిజన్ల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. గత నెలలో ముగ్గురు యువకులు.. జాన్ విక్టర్, రాకేష్, కరిముల్లాలను.. పోలీసులు నడిరోడ్డుపై లాఠీలతో తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇది ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు నెటిజన్లు కూడా అభిప్రాయపడ్డారు.
ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత.. దీనిని చూసిన వారిలో ఏ ఒక్కరూ సమర్థించలేదు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి.
1) పోలీసులు బరితెగించి.. నడి రోడ్డుపై లాఠీలను ఎంచుకుని మరీ చితకబాదడం.
2) పోలీసులు అంటేనే భయ పెట్టేలా వారి తీరు ఉండడం.
ఈ రెండు అంశాలపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అయితే.. సర్కారు మాత్రం దీనిని సమర్థించుకుంది. వారు గంజాయి బ్యాచ్ అని కొడితే తప్పేంటని మంత్రి అని ప్రశ్నించారు.
అయితే.. వాస్తవానికి రాస్ట్రంలోనే కాదు.. దేశంలోనే అనేక కేసులు ఉన్నాయి. ఉగ్రవాదులు కూడా మనకు పట్టుబడుతున్నారు. కానీ.. వారిని ఎక్కడా బహిరంగంగా పోలీసులే శిక్షించిన చరిత్ర లేదు. పైగా.. చట్టం కూడా దానికి అనుమతించదు. కోర్టులు, విచారణలు.. తీర్పుల ద్వారా.. చట్టం ప్రకారమే వారిని శిక్షించాలి కానీ.. లేకపోతే.. అవెందుకన్న ప్రశ్నలు వుదయిస్తున్నాయి. వీటిపైనే నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. గతంలో వైసీపీ హయాంలో డాక్టర్ సుధాకర్ అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు.
నాడు డాక్టర్ సుధాకర్ను పోలీసులు నడిరోడ్డుపై పెడ రెక్కలు విరిచి కట్టడాన్ని ఎవరూ సమర్థించలేదు. అప్పుడు విమర్శించిన టీడీపీ నాయకులు.. ఇప్పుడు సమర్థించడాన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దీనిని ఖండించడంతో పాటు.. పోలీసుల తీరును కూడా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ''ఇది మంచి ప్రభుత్వం'' అంటే.. కేవలం మాటలకే పరిమితం కారాదని.. చేతల్లో కూడా చూపించాలని అంటున్నారు.
Social Plugin