Hot Posts

6/recent/ticker-posts

వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన కేంద్ర మంత్రి


ANDRAPRADESH: వైసీపీకి 2024 ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ప్రతిపక్ష హోదాకు 18 సీట్లు అవసరం అవుతాయి అంటే ఆ నంబర్ కూడా దక్కలేదు. దాంతో దారుణమైన ఓటమిని వైసీపీ చవి చూసింది. వైసీపీ ఓటమి ఒక ఎత్తు అయితే టీడీపీ కూటమి నేతలు గత ఏడాదిగా చేస్తున్న పొలిటికల్ ర్యాగింగ్ మరో ఎత్తు.


అఫ్ కోర్స్ వైసీపీ నేతలు కూడా తాము అధికారంలో ఉన్నపుడు టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయని సెటైర్లు వేసేవారు. ఇపుడు అది రివర్స్ అవుతోంది. ఈ ముచ్చట ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది. అయితే 2029లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో ఇప్పటి నుంచే టీడీపీ నేతలు జోస్యం చెబుతున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే వైసీపీకి సింగిల్ డిజిట్ ఇచ్చారు.

ప్రస్తుతం 11 సీట్లుగా ఉన్న వైసీపీ 2029 నాటికి ఒక్క సీటుకే పరిమితం అవుతుందని అంటున్నారు. వైసీపీ వెన్నుపోటు దినం పేరుతో నిరసనలు చేయడం వల్లనే ఇలా జరుగుతుందని విశ్లేషించారు. పనీ పాటా లేకపోవడం వల్లనే వైసీపీ వారు ఈ తరహా నిరసనలు చేస్తున్నారు అని కేంద్ర మంత్రి ఎద్దేవా చేస్తున్నారు

ఏపీలో కూటమి పాలన బాగుందని ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఓర్వలేని వైసీపీ నేతలే నిరసనలు అంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. తాము భ్రమలలో ఉంటూ ఏపీలో ఏదో జరిగిపోతుంది అని వైసీపీ నేతలు చాటి చెప్పడానికి చూస్తున్నారని అంటున్నారు. అయితే జనాలు ఇవేమీ పట్టించుకోరని అన్నారు.

కేంద్ర మంత్రి అలా వైసీపీ నిరసనల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ సింగిల్ సీటుని ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం మీద తొలి ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అది తమ ఆందోళనలలో కనిపించిందని వైసీపీ నేతలు అంటున్నారు. దానిని కప్పి పుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు.